వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ ఆదివారం రాత్రి 7.20 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు మీడియాకు వెల్లడించారు. సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నా కూడా.. జగన్ ను సీబీఐ దుందుడుకుగా వ్యవహరించి అన్యాయంగా అరెస్ట్ చేసిందని ఆయన విమర్శించారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఉద్రేకానికి పోకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. ఈ అరెస్ట్ దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment