ఫ్యాన్ గుర్తు కేటాయించండి, ఈసీకి వైఎస్సార్ కాంగ్రెస్ వినతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫ్యాన్ గుర్తు కేటాయించండి, ఈసీకి వైఎస్సార్ కాంగ్రెస్ వినతి

ఫ్యాన్ గుర్తు కేటాయించండి, ఈసీకి వైఎస్సార్ కాంగ్రెస్ వినతి

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఫ్యాన్ గుర్తు కేటాయించాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, జనక్‌ప్రసాద్, ఆది శ్రీనివాస్, కొండా రాఘవరెడ్డి తదితరులు శనివారం ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి వివిధ అంశాలపై ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన డెరైక్షన్ కాపీని కూడా వారు ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. సెక్షన్ 199 ప్రకారం సభ్యత్వం కోల్పోయిన (అనర్హతకుగురైన) వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ టీడీపీ, కాంగ్రెస్ వారు అభ్యంతరం చెప్పిన విషయాన్ని కూడా పార్టీ నేతలు ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం 199 -1 ప్రకారం పదవులకు మాత్రమే అనర్హులవుతారని, తిరిగి పోటీ చేయడానికి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు స్పష్టం చేశారు. 

ప్రచారం చేసుకునే వీలు కల్పించండి

‘మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనీయకుండా కుట్ర జరుగుతోంది. సీబీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వంగానీ ఇతర సంస్థలుగానీ జగన్‌ను అడ్డుకోవాలని చూస్తున్నాయి. తద్వారా మా పార్టీ అభ్యర్థులను ఏదో విధంగా వెన్నుపోటు పొడిచే కుట్ర జరుగుతోంది. సీబీఐ కల్పించే అడ్డంకులను తొలగించి మా నాయకుడికి స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పించాలని వినమ్రతతో కోరుతున్నాం’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. 
Share this article :

0 comments: