విశాఖ : చంద్రబాబు నాయుడు సర్కార్ మోసపూరిత విధానాలపై తాము చేసే పోరాటం ఆరంభం మాత్రమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ జనవరి 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మెడలు వచ్చేందుకు ప్రజలందరు సహకరించాలని వైఎస్ జగన్ కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలమంది చేస్తున్న ధర్నాలకు కారణం ఏమిటనే ఆలోచన చేసే స్థితిలో పాలకులు, నాయకులు లేరని వైఎస్ జగన్ అన్నారు. ప్రజలతో పనైపోయిన తర్వాత ఇప్పుడేమంటున్నారని ఆయన వారిని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
0 comments:
Post a Comment