భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ

భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Monday, December 1, 2014 | 12/01/2014


భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించారు. వైఎస్ జగన్ ఫోన్ చేసి నాగిరెడ్డిని ఓదార్చారు. భూమా నాగిరెడ్డి తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతుండేవారు. ఆమె భౌతికకాయాన్నిఅంత్యక్రియల నిమిత్తం ఆళ్లగడ్డ తరలిస్తున్నారు.
 
కాగా ఇటీవల భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు.
Share this article :

0 comments: