బొత్స గాంధీభవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ‘‘నేను లిక్కర్ డాన్ అని, మద్యం సిండికేట్ల నుంచి నేను డబ్బులు తీసుకున్నానని వాళ్లు చెబుతున్నారు. దీనిపై ఏ విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నా. అందులో నా ప్రమేయం ఉందని తేలినా, రూ.10 లు తీసుకున్నట్లు నిరూపించినా ప్రజల వద్ద నిలబడి సిగ్గుతో తలదించుకుంటానే తప్ప చంద్రబాబు మాదిరిగా ‘ఛీ...పో...’ అని జనం చీదరించినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే వ్యక్తిని కాదు’’అని చెప్పారు.
తన పేరిట మద్యం వ్యాపారం లేదని, అయితే కుటుంబ సభ్యులు మాత్రం విజయనగరం పట్టణంలో దాదాపు 25 శాతం మేరకు మద్యం షాపులు నిర్వహిస్తున్నారని అంగీకరించారు. వాస్తవానికి మద్యం సిండికేట్ల నుంచి డబ్బులు దోచుకునే వ్యక్తి చంద్రబాబేనని, స్వయాన ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు గతంలో ఈ మాటలు చెప్పారని గుర్తు చేశారు. తనను లక్ష్యంగా చేసుకునే ఏసీబీ ద్వారా సీఎం మద్యం సిండికేట్లపై దాడులు చేయించారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, త్వరలోనే అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
తన పేరిట మద్యం వ్యాపారం లేదని, అయితే కుటుంబ సభ్యులు మాత్రం విజయనగరం పట్టణంలో దాదాపు 25 శాతం మేరకు మద్యం షాపులు నిర్వహిస్తున్నారని అంగీకరించారు. వాస్తవానికి మద్యం సిండికేట్ల నుంచి డబ్బులు దోచుకునే వ్యక్తి చంద్రబాబేనని, స్వయాన ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు గతంలో ఈ మాటలు చెప్పారని గుర్తు చేశారు. తనను లక్ష్యంగా చేసుకునే ఏసీబీ ద్వారా సీఎం మద్యం సిండికేట్లపై దాడులు చేయించారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, త్వరలోనే అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
0 comments:
Post a Comment