న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ని కలిశారు. రైతు నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు. రాష్ట్రంలోని రైతు సమస్యలపై జగన్ ఒక నివేదికని మంత్రికి అందజేశారు. మూడు పేజీల నివేదికలో 7 అంశాలను జగన్ పేర్కొన్నారు. పంటల బీమా సమస్య, రైతుల రుణాల సమస్య, విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను ఆయన మంత్రికి వివరించారు.
రాష్ట్రంలో ఎఫ్ సిఐ గోదాముల కొరతని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ విజ్ఞప్తుల పట్ల మంత్రి వెంటనే స్పందించారు. ప్రజాపంపిణీ శాఖ మంత్రి థామస్ సమక్షంలో రేపు ఎఫ్ సిఐ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జగన్ ని కూడా మంత్రి ఆహ్వానించారు. రాష్ట్రంలోని రైతులను అన్నివిధాల ఆదుకుంటామని మంత్రి జగన్ కు హామీ ఇచ్చారు.
జగన్ వెంట మంత్రిని కలిసిన వారిలో ఎంపిలు మేకపాటి రాజమోహన రెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర రావు, కొండా మురళీ, రైతు నేతలు తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో ఎఫ్ సిఐ గోదాముల కొరతని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ విజ్ఞప్తుల పట్ల మంత్రి వెంటనే స్పందించారు. ప్రజాపంపిణీ శాఖ మంత్రి థామస్ సమక్షంలో రేపు ఎఫ్ సిఐ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జగన్ ని కూడా మంత్రి ఆహ్వానించారు. రాష్ట్రంలోని రైతులను అన్నివిధాల ఆదుకుంటామని మంత్రి జగన్ కు హామీ ఇచ్చారు.
జగన్ వెంట మంత్రిని కలిసిన వారిలో ఎంపిలు మేకపాటి రాజమోహన రెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర రావు, కొండా మురళీ, రైతు నేతలు తదితరులు ఉన్నారు.
0 comments:
Post a Comment