వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఈరోజు లోక్ సభలో రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై సావధాన తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర రైతుల సమస్యలపై మాట్లాడే అవకాశం రాకపోయినా 377 నిబంధన కింద ఇచ్చిన ఈ నోటీస్ అధికారికంగా సభ రికార్డులలో నమోదైంది. తన ప్రసంగపాఠాన్ని జగన్ లోక్ సభ సభ్యులు అందరికీ పంపిణీ చేశారు.
క్రాప్ హాలిడే, పంట రుణాలు, కనీస మద్దతు ధర అంశాలను జగన్ ఆ నోటీస్ లో ప్రస్తావించారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమగ్ర పంటల బీమా అమలుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. అందుబాటు ధరల్లో రైతులకు విత్తనాలు అందించాలన్నారు. ఎరువులు అందించేందుకు పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం ఉదయం కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ నేడు లోక్ సభలో ప్రస్తావించనున్నారు. క్రాప్ హాలీడే, పంట మద్దతు ధరలు, రుణాల విషయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా సభ ముందుకు తేనున్నారు.
ఈ మేరకు వైఎస్ జగన్ లోక్సభలో 377 నిబంధన కింద స్పీకర్కు నోటీస్ ఇచ్చారు. అలాగే ఈరోజు సాయంత్రం జగన్మోహన్రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్పవార్ను కలుసుకోనున్నారు.
క్రాప్ హాలిడే, పంట రుణాలు, కనీస మద్దతు ధర అంశాలను జగన్ ఆ నోటీస్ లో ప్రస్తావించారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమగ్ర పంటల బీమా అమలుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. అందుబాటు ధరల్లో రైతులకు విత్తనాలు అందించాలన్నారు. ఎరువులు అందించేందుకు పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం ఉదయం కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ నేడు లోక్ సభలో ప్రస్తావించనున్నారు. క్రాప్ హాలీడే, పంట మద్దతు ధరలు, రుణాల విషయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా సభ ముందుకు తేనున్నారు.
ఈ మేరకు వైఎస్ జగన్ లోక్సభలో 377 నిబంధన కింద స్పీకర్కు నోటీస్ ఇచ్చారు. అలాగే ఈరోజు సాయంత్రం జగన్మోహన్రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్పవార్ను కలుసుకోనున్నారు.
0 comments:
Post a Comment