మాజీమంత్రి కోమటిరెడ్డి కుమారుడి దుర్మరణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాజీమంత్రి కోమటిరెడ్డి కుమారుడి దుర్మరణం

మాజీమంత్రి కోమటిరెడ్డి కుమారుడి దుర్మరణం

Written By news on Tuesday, December 20, 2011 | 12/20/2011

రామచంద్రాపురం మండలం కొల్లూరు వద్ద జరిగిన కారు ప్రమాదంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకైక కుమారుడు ప్రతీక్ రెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వీరు ముగ్గురూ సిబిఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. మిగిలిన ఇద్దరిని సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డిగా గుర్తించారు. కారు డివైడర్ ను ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గొర్రెలను తప్పించబోయి డివైడర్ కు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో విద్యార్థి అరవ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది.

ప్రతీక్ రెడ్డి మృతితో నల్గొండ జిల్లాలో విషాదచాయలు అలముకున్నాయి. కొడుకు మరణవార్త విని వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ బయలుదేరారు.

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సంతాపం తెలిపారు. మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో కోమటిరెడ్డి కుమారుడు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రతీక్ రెడ్డి మరణవార్త విని జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Share this article :

0 comments: