ప్రోటోకాల్ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించకపోవటం అన్యాయమని బాలినేని అన్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానపరిచారని ఆయన ధ్వజమెత్తారు.
అధికార పార్టీకి కొమ్ముకాసే అధికారులు ఆ పార్టీ కండువాలు వేసుకుని తిరిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర కాంగ్రెస్ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఈ విషయమై ప్రివిలైజేషన్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
అధికార పార్టీకి కొమ్ముకాసే అధికారులు ఆ పార్టీ కండువాలు వేసుకుని తిరిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర కాంగ్రెస్ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఈ విషయమై ప్రివిలైజేషన్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
0 comments:
Post a Comment