గుంటూరుసెంట్రల్, న్యూస్లైన్ : ఓదార్పుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే చూసి ఓర్వలేక ఎల్లో మీడియాలో అసత్య కథనాలు ప్రచురించి, ప్రసారం చేస్తున్నారని వైఎస్సార్కాంగ్రెస్ కృష్ణాజిల్లా నాయకుడు శీలం రాజా విమర్శించారు. అరండల్పేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్యకథనాలు ప్రచురించడాన్ని నిరసిస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శీలం రాజా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహనరెడ్డిని గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్జగన్మోహనరెడ్డి, వైఎస్ విజయమ్మలను కించపరిచే విధంగా కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ ఓదార్పుయాత్రకు విద్యార్థులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్థులు పానుగంటి చైతన్య, ఈశ్వరరెడ్డి, నరేంద్ర, తియ్యగూర వంశీ, అజయ్, దర్శనపు అశోక్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్జగన్మోహనరెడ్డి, వైఎస్ విజయమ్మలను కించపరిచే విధంగా కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ ఓదార్పుయాత్రకు విద్యార్థులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్థులు పానుగంటి చైతన్య, ఈశ్వరరెడ్డి, నరేంద్ర, తియ్యగూర వంశీ, అజయ్, దర్శనపు అశోక్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
జగనన్నకు నీరా‘జనం’ | |
|
0 comments:
Post a Comment