రాష్ట్రమంత కుటుంబం తోడుంది: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రమంత కుటుంబం తోడుంది: వైఎస్ జగన్

రాష్ట్రమంత కుటుంబం తోడుంది: వైఎస్ జగన్

Written By news on Wednesday, November 16, 2011 | 11/16/2011


గుంటూరు : ఎమ్మెల్యేలు వెంటలేకపోయినా రాష్ట్రమంత కుటుంబం తనకు తోడుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం గుంటూరు జిల్లాలో మలివిడత ఓదార్పుయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఓ తల్లిని, బిడ్డను ఎదుర్కొనేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటై దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
 
 
 
కరువు మండలాల ప్రకటన శాస్త్రీయంగా లేదు'




కడప : పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని పులివెందుల ఎమ్మెల్మే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన డీఆర్ సీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరువు మండలాల ప్రకటన శాస్త్రీయంగా లేదని అభిప్రాయపడ్డారు. 

కాగా డీఆర్ సీ సమావేశంలో ఎమ్మల్యే శ్రీరాములు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలో శిలాఫలకం పగులకొట్టి దళితుడైన తనను అవమానించారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
Share this article :

0 comments: