రాజీనామాలు విషయమై స్పీకర్ నుంచి తమకు ఎలాంటి పిలుపు అందలేదని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తెలిపారు. జగన్ వర్గ
ఎమ్మెల్యేలంతా జగన్ వైపేనని ఆయన స్పష్టం చేశారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు తామంటే గిట్టని
మీడియా సృష్టేనని గుర్నాథరెడ్డి అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు గురువారం శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉదయం పూట స్పీకర్ను కలవగా, శివప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సాయంత్రం కలిశారు. వారు స్పీకర్తో ఏం మాట్లాడారనే విషయం తెలియదు. వారెవరు కూడా మీడియాతో మాట్లాడలేదు. తన వద్ద పెండింగులో రాజీనామాలను పరిష్కరించే పనిలో స్పీకర్ పడ్డారు. డిసెంబర్ 1వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వాటిని పరిష్కరించాలని ఆయన అనుకుంటున్నారు. ఈ స్థితిలో వారు ముగ్గురు స్పీకర్ను కలిశారు.
మోళ్లగుంట చేరుకున్న ఓదార్పు యాత్ర | |||||||||
|
0 comments:
Post a Comment