Home »
» చేతగాని ప్రభుత్వమిది: వైఎస్ జగన్
చేతగాని ప్రభుత్వమిది: వైఎస్ జగన్
గుంటూరు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లల చదువుల్లోనూ కోత విధిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. గతేడాది స్కాలర్షిప్లతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని చేతగాని ప్రభుత్వమిదని విమర్శించారు. దివంగత మహానేతపై కేసులు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. రచ్చబండ పేరుతో ప్రజలను కిరణ్ సర్కారు మోసం చేస్తోందన్నారు. అర్హులందరికీ రేషన్కార్డులు అందాలన్న వైఎస్ ఆశయాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్ హయాంలో మిగతా రాష్ట్రాల్లో 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత మహానేతకు దక్కుతుందన్నారు.కాంగ్రెస్ సర్కారును మోస్తున్న బాబు: జూపూడి |
|
|
|
|
|
ఒంగోలు: దద్దమ్మ ప్రభుత్వమని కిరాణ్కుమార్రెడ్డి సర్కారును విమర్శిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు మోస్తున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలను పార్లమెంట్ తరహాలో రెండు వారాలు కొనసాగించాలన్నారు. అసెంబ్లీని సరిగా నడిపిస్తే ఈ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలవుతాయని జూపూడి అన్నారు. |
|
0 comments:
Post a Comment