కర్ణాటకలోని బళ్లారి రూరల్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్ పై 46 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మాజీ మంత్రి శ్రీరాములు రాజీనామాతో నవంబర్ 30న ఈ ఉప ఎన్నికలు జరిగాయి.
ఉప పోరులో శ్రీరాములు స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంప్రసాద్, బీజేపీ అభ్యర్థిగా గాదిలింగప్ప పోటీ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడోస్థానంతో సరిపెట్టుకోవటమే కాకుండా ధరావతు కూడా కోల్పోయింది. కాగా శ్రీరాములు గెలుపుతో అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఉప పోరులో శ్రీరాములు స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంప్రసాద్, బీజేపీ అభ్యర్థిగా గాదిలింగప్ప పోటీ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడోస్థానంతో సరిపెట్టుకోవటమే కాకుండా ధరావతు కూడా కోల్పోయింది. కాగా శ్రీరాములు గెలుపుతో అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
0 comments:
Post a Comment