ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వ్యక్తులు తనకు విప్ ఎలా ఇస్తారని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాము ఓటింగ్ కు వెళ్లామని ఆమె చెప్పారు. తనకు పిఆర్ పి విప్ జారీ చేయడం హాస్యాస్పదమన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వంగా గీత కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యురాలని, ఆమె పిఆర్ పి పేరుమీద తనకు విప్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అన్నిటికీ సిద్ధమయ్యే శాసనసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమె చెప్పారు.
పిఆర్ పి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన సమయంలో తనకు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఇష్టంలేదని ఎన్నికల సంఘానికి తెలిపినట్లు ఆమె చెప్పారు. తనని స్వతంత్ర శాసనసభ్యురాలిగా గానీ లేదా పిఆర్ పి సభ్యురాలిగా గానీ ఉండనివ్వమని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆమె వివరించారు. తన పిటిషన్ ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లో ఉందన్నారు.
పిఆర్ పి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన సమయంలో తనకు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఇష్టంలేదని ఎన్నికల సంఘానికి తెలిపినట్లు ఆమె చెప్పారు. తనని స్వతంత్ర శాసనసభ్యురాలిగా గానీ లేదా పిఆర్ పి సభ్యురాలిగా గానీ ఉండనివ్వమని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆమె వివరించారు. తన పిటిషన్ ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లో ఉందన్నారు.
0 comments:
Post a Comment