తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్

Written By news on Saturday, January 19, 2013 | 1/19/2013


 తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అధిష్టానం దెబ్బతీస్తోందని, ఢిల్లీ వెళ్లిన మంత్రులను సైతం పార్టీ నుంచి వెళ్లిపోతే పోండి అన్నట్టుగా మాట్లాడ్డమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే అయినా రాష్ట్ర ప్రజాప్రతినిధుల, ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ధ్వజమెత్తారు.

శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే కె.శ్రీనివాసులుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్‌గాంధీ అవమానించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరడం వల్లనే కాంగ్రెస్‌కు ఆనాడు ప్రజలు గుణపాఠం నేర్పారని, ఇప్పుడూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రం ఈరోజు అధోగతి పాలుకావడానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరే కారణమని దుయ్యబట్టారు. చంద్రబాబు రోజుకోరకంగా మాట్లాడి గడి యకో అభిప్రాయం చెప్పడం వల్లనే రాష్ట్రం గందరగోళంలో పడిందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి నిర్ణయం తీసుకోవలసిన కాంగ్రెస్ రెండురకాలుగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అయోమయంలోనికి నెట్టిందని విమర్శించారు. అన్నిప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించడంతోపాటు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేలా అభిప్రాయం చెప్పిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటేనని శ్రీనివాసులు పేర్కొన్నారు.
Share this article :

0 comments: