అనంతపురం: తాడిపత్రిలో రౌడీయిజం రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండాసురేఖ అన్నారు. మీడియాను సైతం కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ పాలన సువర్ణయుగమైతే చంద్రబాబు, కిరణ్లది దుష్టపాలన అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ రెక్కల కష్టంతో ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రాంతాలు, మతాలు, కులాలకతీతంగా రాష్ట్రాన్ని వైఎస్ఆర్ అభివృద్ధి చేశారన్నారు.
కాంగ్రెస్లో ఉంటే జగన్ మంచివాడు.. బయటకు వస్తే చెడ్డవారు..ఇదీ కాంగ్రెస్ నైజం అన్నారు. వైఎస్ఆర్ రుణం తీర్చుకోవాలంటే జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జగన్ను సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సహకార ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కవుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలకు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని కొండా సురేఖ ధైర్యం చెప్పారు.
కాంగ్రెస్లో ఉంటే జగన్ మంచివాడు.. బయటకు వస్తే చెడ్డవారు..ఇదీ కాంగ్రెస్ నైజం అన్నారు. వైఎస్ఆర్ రుణం తీర్చుకోవాలంటే జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జగన్ను సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సహకార ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కవుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలకు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని కొండా సురేఖ ధైర్యం చెప్పారు.
0 comments:
Post a Comment