జగన్ శ్రీవారి దర్శనంలో వివాదం లేదు:టీటీడీ ఈవో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ శ్రీవారి దర్శనంలో వివాదం లేదు:టీటీడీ ఈవో

జగన్ శ్రీవారి దర్శనంలో వివాదం లేదు:టీటీడీ ఈవో

Written By news on Friday, March 7, 2014 | 3/07/2014

తిరుమల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో ఎలాంటి వివాదం లేదని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హిందూ సంప్రదాయబద్ధంగానే స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని టీటీడీ ఈవో గోపాల్‌ మండిపడ్డారు.
ఒకవర్గం మీడియాలో వైఎస్ జగన్ శ్రీవారి దర్శనంపై విపరీతంగా ప్రచారం జరగడం, ఆ వివాదం ఏంటో వివరాలు పంపాలని గవర్నర్ నరసింహన్ కూడా టీటీడీ అధికారులను కోరడం లాంటి విషయాలు తెలిసిందే. ఇప్పుడు స్వయంగా టీటీడీ ఈవోనే విషయం బయటపెట్టడంతో వివాదానికి తెర పడినట్లయింది.
Share this article :

0 comments: