Home »
» రైతుల కోసం కాదు ఉప ఎన్నికల కోసం:జగన్
రైతుల కోసం కాదు ఉప ఎన్నికల కోసం:జగన్
|
|
|
|
|
|
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేది రైతుల కోసం కాదని, ఉప ఎన్నికల కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా ఈరోజు ఆయన అనంతవరప్పాడు గ్రామం వెళ్లారు. అభిమానులు, కార్యకర్తలు జగన్ కు ఘనస్వాగతం పలికారు. జగన్ వస్తున్నారని జనం భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు జరుగుతుందంటే అవిశ్వాస తీర్మానానికి తాము కూడా మద్దతు పలుకుతామన్నారు. తనకు, తన ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉందని చెప్పారు.
ధాన్యానికి 730 రూపాయల మద్దతు ధర చూసి పంట కోయడానికే రైతు భయపడుతున్నారన్నారు. విద్యుత్, నీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. |
|
0 comments:
Post a Comment