మహానేత వైఎస్సార్ తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర చేస్తారు. 165వ రోజున గోటేరు క్రాస్ రోడ్స్ , గోపాలపురం, తణుకు ఇరగవరం ఎస్సీ కాలనీ, ఆర్పీ రోడ్, తణకు జెడ్పీ హైస్కూల్ మీదుగా వెంకటేశ్వరా థియేటర్ రోడ్డు వరకు షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వెంకటేశ్వరా థియేటర్ రోడ్ వద్ద బస చేయనున్నారు. ఇవాళ మొత్తం 12.2కి.మీ మేర షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
Home »
» 165వ రోజు యాత్రను ప్రారంభించిన షర్మిల
165వ రోజు యాత్రను ప్రారంభించిన షర్మిల
Written By news on Friday, May 31, 2013 | 5/31/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment