బాబు పెద్ద మాయగాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు పెద్ద మాయగాడు

బాబు పెద్ద మాయగాడు

Written By news on Monday, May 27, 2013 | 5/27/2013

- ఎంపీ మేకపాటి ధ్వజం
- సీఎంగా ఉన్నప్పుడు ఏమీ చేయనివ్యక్తి ఇప్పుడు చేస్తాననడం ప్రజల్ని మభ్యపెట్టడమే
- తన హయాంలో ఒక్క సంక్షేమ పథకమూ చేపట్టలేదు
- జగన్ పులిబిడ్డ: కొణతాల 

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాయగాడని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చేయని పనులను ఇపుడు చేస్తానని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ తొలి మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించే అధికారాన్ని ప్రజలు చంద్రబాబుకు ఇచ్చారని, కానీ ఆయన ప్రజలకు పనికొచ్చే ఒక్క సంక్షేమ పథకమూ చేపట్టలేకపోయారని మేకపాటి అన్నారు. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల వ్యవధిలో పెద్ద ఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాభిమానానికి పాత్రుడయ్యారన్నారు. ‘‘ఒక కాంగ్రెస్ సీఎంగా వైఎస్ ఒక పథకం చేపట్టాలంటే.. ఆయనకు హైకమాండ్, లోకమాండ్ అంటూ అడ్డంకులుండేవి. కానీ చంద్రబాబుకు ఆ సమస్యల్లేవు. అన్నీ తానే అయినందువల్ల ఎలాంటి పని చేసినా వద్దనే వారే ఆరోజు లేరు’’ అని మేకపాటి గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నికలొస్తే 75 శాతం మంది ప్రజలు జగన్ వెంటే ఉంటారన్నారు. వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌లో లక్ష మంది సభ్యులను చేర్పించాలని సూచించారు.

పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది: కొణతాల
వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. పులి కడుపున పులిబిడ్డే పుడుతుందని, అలాంటి వ్యక్తి జగన్ అని అన్నారు. వైఎస్ పథకాల అమలు జగన్ వల్లనే సాధ్యమన్నారు. జగన్ రాకకోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఆయన్ను ఎపుడెపుడు సీఎంను చేయాలా అని ఆలోచిస్తున్నారని కొణతాల చెప్పారు. సీఎం కిరణ్, చంద్రబాబు ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివారేనని, ఇద్దరి విధానాలు ఒకటేనన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని స్పష్టంచేశారు. వైఎస్ ఆర్టీసీ పట్ల ఉదారంగా వ్యవహరించారని, ఏనాడూ వ్యాపారదృష్టితో చూడలేదన్నారు. 

పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ.. తాను ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్‌గా ఉన్నపుడు సంస్థ పరిరక్షణకు అప్పటి సీఎం చంద్రబాబుకు ఎన్నో సూచనలు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. లాభాల్లో నడిచే ఓ సంస్థను ప్రైవేటీకరించాలంటే.. అది నష్టాల్లో కూరుకుపోయేలా బాబు చేసేవారని, తరువాత తాననుకున్న పని చేసేవారన్నారు. లాభాలొచ్చే బస్సురూట్లను ప్రైవేటీకరించి, నష్టాలొచ్చే వాటిని ఆర్టీసీకే ఉంచాలని చంద్రబాబు చూసేవారన్నారు. సభకు అధ్యక్షత వహించిన వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థకు వైఎస్ ఎంతో మేలు చేశారని, ఇందుకుగాను ఆయన కుమారుడికి తామంతా మద్దతుగా ఉండి రుణం తీర్చుకుంటామని చెప్పారు. సభలో వైఎస్సార్ టీయూ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్, ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డితో సహా పలువురు కార్మికనేతలు పాల్గొన్నారు.
Share this article :

0 comments: