పశ్చిమగోదావరి జిల్లాలోకి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పశ్చిమగోదావరి జిల్లాలోకి షర్మిల పాదయాత్ర

పశ్చిమగోదావరి జిల్లాలోకి షర్మిల పాదయాత్ర

Written By news on Sunday, May 12, 2013 | 5/12/2013

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ బాలరాజు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పాకలవారంగూడెం గ్రామం దాటడంతో ఖమ్మం పాదయాత్ర పూర్తి అవుతుందని వారు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెం గ్రామం ద్వారా షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారని చెప్పారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఉండి, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, నిడదవోలు, కొవ్వూరు నియోజక వర్గాల్లో యాత్ర సాగుతుందని, దాదాపు 20 రోజుల పాటు 275 కిలో మీటర్ల మేర యాత్ర సాగుతుందని వారు చెప్పారు
Share this article :

0 comments: