రాజీనామా చేసిన 15 స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ఓటమి తప్పదన్నారు. ఎస్.కోటలో పదివేల మంది కార్యకర్తలతో వైఎస్ఆర్ సీపీ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ సబ్బంహరి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెన్మత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తదితర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీలో చేరారు.
Home »
» భయపడుతున్న కాంగ్రెస్: బొబ్బిలి ఎమ్మెల్యే
భయపడుతున్న కాంగ్రెస్: బొబ్బిలి ఎమ్మెల్యే
Written By news on Saturday, May 18, 2013 | 5/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment