విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ జయప్రకాష్కు వైఎస్సార్సీపీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని జయప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, డీఏ సోమయాజులు పాల్గొన్నారు.
Home »
» వైఎస్సార్సీపీలోకి అడుసుమిల్లి
వైఎస్సార్సీపీలోకి అడుసుమిల్లి
Written By news on Thursday, May 16, 2013 | 5/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment