మొత్తానికి జగన్ కేసు ద్వారా కాంగ్రెస్ ఒక సంకేతాన్ని పంపించింది. ‘అవినీతిపరులు మా కాంగ్రెస్ లీడర్లయితే రక్షిస్తాం. మమ్మల్ని కాదన్నవారు అమాయకులైనా సరే వారిపై తప్పుడు కేసులు బనాయించి నెలలతరబడి జైళ్ళలో మగ్గబెట్టి శిక్షిస్తాం’.
ఆహా... ఎంతటి గొప్ప సందేశాత్మక సంకేతం! అయినా కాంగ్రెస్ వారు కేసుల బూచిని చూపితే జగన్ భయపడిపోయి కాంగ్రెస్ పంచన చేరతాడన్నది భ్రమ. చంద్రబాబు అంతటివాడే కాంగ్రెస్ చేయి అందుకున్నాడు కదా, జగన్ ఎందుకు అందుకోడని కాంగ్రెస్ నాయకుల ఆశ్చర్యం. చంద్రబాబుది అవకాశవాద పోరాటం. జగన్ది అసలైన పోరాటం. అందుకే ఆయన కాంగ్రెస్ పంచన చేరడు. ‘వజ్ర సంకల్పం గల యువకులు, ధీరోదాత్తత కల్గిన వ్యక్తులే ఈ సమాజాన్ని మార్చగలరు’ అన్న స్వామివివేకానంద మాటకు జీవంపోసే జగన్ ప్రభంజనాన్ని ఏ కుట్రలు కుతంత్రాలు అడ్డుకోగలవు? నిత్యం రెండు పత్రికలు, కొన్ని ఛానల్స్ ఎన్ని అసత్యాలను వండి వార్చినా విజ్ఞత కలిగిన ప్రజలకు తెలీదా! వారెప్పుడూ చైతన్యవంతులే! తమ అభిరుచులకి, ఆశయాలకి, ఆదర్శాలకి ఎవరు దగ్గరగా ఉన్నారో వారికి తెలుసు. తమకోసం ఎదురునిలిచి పోరాడే ధైర్యం, శక్తి ఒక్క జగన్కే ఉన్నాయని వారికి తెలుసు. అందుకే జగన్ వెంట జనం... జనం ఆశయాల రూపంగా జగన్ ఉన్నారు. కాంగ్రెస్ ఎన్ని సంకేతాలు పంపినా ప్రజలు చూపించే విజయసంకేతం ఒకటే. ‘మా నాయకుడు జగన్. మీరెవ్వరూ కాదు’ అనే సందేశం ఒక్కటే. - జి.పి. ప్రభాకర్, మంటాడ, కృష్ణా జిల్లా |
Home »
» జగన్ది అసలు సిసలు పోరాటం
జగన్ది అసలు సిసలు పోరాటం
Written By news on Tuesday, May 14, 2013 | 5/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment