సెప్టెంబర్‌ 2 నుంచి షర్మిల బస్సుయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సెప్టెంబర్‌ 2 నుంచి షర్మిల బస్సుయాత్ర

సెప్టెంబర్‌ 2 నుంచి షర్మిల బస్సుయాత్ర

Written By news on Thursday, August 29, 2013 | 8/29/2013

 వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున వైయస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో వైయస్ఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె బస్సుయాత్రను ప్రారంభిస్తారు. బస్సు యాత్ర షెడ్యూల్ ను త్వరలోనే వెల్లడిస్తారు.

రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టిచుకోని అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం, దానితో అంట కాగుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సుమారు నెల రోజుల క్రితమే ముగిసిన విషయం తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మరో సారి ఆమె రాష్ట్ర ప్రజల కోసం బస్సుయాత్రను తలపెట్టారు.
Share this article :

0 comments: