Home »
» ప్రమాద పరిస్థితులలో ఉన్నా దీక్ష విరమించేందుకు నిరాకరించిన జగన్
ప్రమాద పరిస్థితులలో ఉన్నా దీక్ష విరమించేందుకు నిరాకరించిన జగన్
హైదరాబాద్ : సమన్యాయం చేయాలంటూ ఉస్మానియా ఆస్పత్రిలో కూడా ఆరో రోజు దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం నెఫ్రాలజిస్టులు (కాలేయ పరీక్ష) వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆహారం తీసుకోవాలని జగన్ కు సూచించారు. షుగర్ లెవల్స్ బాగా పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. శరీరం నుంచి కీటోన్స్ బాగా వెలువడుతున్నట్లు వారు తెలిపారు. ఇవన్నీ ప్రమాదానికి సంకేతాలని వైద్యులు చెబుతున్నారు. జగన్ దీక్ష విరమించాల్సిందేనని వారు పేర్కొన్నారు. అయితే దీక్ష విరమించేందుకు జగన్ నిరాకరించినట్లు సమాచారం.
అంతకు ముందు వైద్యులు చికిత్స నిర్వహిస్తామని, శరీరం నీరసిస్తోందని, ఆరోగ్యం క్షీణిస్తోందని, తక్షణం ఫ్లూయిడ్స్ ఎక్కించాలని జగన్మోహన్రెడ్డికి సూచించారు. INCU-116 నెంబర్ గదిలో జగన్కు ఇసిజి పరీక్షలు చేశారు. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. శరీరంలో కీటోన్ బాడీస్ పెరుగుతున్నాయని హెచ్చరించారు. అయితే జగన్ వారిని వారించారు.
కాగా జగన్ ను పరామర్శించేందుకు ఆయన చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి ఈరోజు ఉదయం ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఆయనను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ జగన్ ను చూసేందుకు అనుమతించకపోవటం హేయమైన చర్య అన్నారు.
0 comments:
Post a Comment