గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డిని గురువారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించడానికి రంగం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. రాత్రి ట్రాఫిక్ తగ్గిన తర్వాత అయితేనే ఆయన భద్రతకు పూర్తి భరోసా ఉంటుందని, దానికితోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల నుంచి కూడా ప్రతిఘటన మరీ ఎక్కువగా ఎదురుకాకుండా ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులు 'జై జగన్' నినాదాలతో ఆ ప్రాంతం మొత్తాన్ని హోరెత్తించారు.
రాత్రి 10.30 గంటల సమయంలో చంచల్ గూడ జైల్లోకి ఎస్కార్టు వాహనం వెళ్లింది. అప్పటికే చంచల్ గూడ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసు, కేంద్ర బలగాలు చేరుకున్నాయి. రాత్రి 11 గంటల సమయంలో పైలట్ వాహనాల సైరన్లు బయటకు వినిపించాయి. చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి వరకు వెళ్లే మార్గం మొత్తాన్ని ముందుగానే పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఏ నిమిషంలోనైనా జగన్ ను తరలిస్తారని భావిస్తున్నారు
రాత్రి 10.30 గంటల సమయంలో చంచల్ గూడ జైల్లోకి ఎస్కార్టు వాహనం వెళ్లింది. అప్పటికే చంచల్ గూడ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసు, కేంద్ర బలగాలు చేరుకున్నాయి. రాత్రి 11 గంటల సమయంలో పైలట్ వాహనాల సైరన్లు బయటకు వినిపించాయి. చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి వరకు వెళ్లే మార్గం మొత్తాన్ని ముందుగానే పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఏ నిమిషంలోనైనా జగన్ ను తరలిస్తారని భావిస్తున్నారు
0 comments:
Post a Comment