వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చంచల్గూడ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగన్కు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత రెహ్మాన్ ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు ప్రదర్శనగా జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. జైలు వద్ద ప్రదర్శనకు వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. రెహ్మాన్ సహా పలువురు కార్యకర్తల అరెస్ట్ చేశారు.
మరోవైపు ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనను చూసేందుకు చంచల్గూడ జైలు వద్దకు భారీగా తరలివస్తున్నారు. వీరి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా నిన్న పలువురిని ఈడ్చే పడేయడం విమర్శలకు తావిచ్చింది.
మరోవైపు ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనను చూసేందుకు చంచల్గూడ జైలు వద్దకు భారీగా తరలివస్తున్నారు. వీరి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా నిన్న పలువురిని ఈడ్చే పడేయడం విమర్శలకు తావిచ్చింది.
0 comments:
Post a Comment