దీక్షతో తీవ్రంగా నీరసించిన జగన్: నిమ్స్ వైద్యులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీక్షతో తీవ్రంగా నీరసించిన జగన్: నిమ్స్ వైద్యులు

దీక్షతో తీవ్రంగా నీరసించిన జగన్: నిమ్స్ వైద్యులు

Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఏకపక్ష, నిరంకుశ వైఖరికి నిరసనగా ఏడు రోజుల పాటు చేసిన నిరవధిక నిరాహార దీక్షతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నీరసించిపోయారని నిమ్స్ వైద్యులు తెలిపారు.

ఆయన కోలుకోడానికి సమయం పడుతుందని వెల్లడించారు. తాము ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని తెలిపారు. జగన్ బాగా బరువు తగ్గిపోయారని, ఆయన శరీరంలో నీరు బాగా తగ్గిపోయిందని చెప్పారు. కేవలం ఫ్లూయిడ్స్ మాత్రమే కాక నోటి ద్వారా కూడా ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే శరీరం సాధారణ స్థితికి చేరడానికి వీలుంటుందని జగన్కు వారు సూచిస్తున్నారు.

బరువు బాగా తగ్గిపోయారని, గతంలో ఆయన ఎంత బరువు ఉండేవారో తెలియకపోయినా, ప్రస్తుతం మాత్రం బాగా తగ్గినట్లు చెప్పగలమని వైద్యులు అన్నారు. ప్రతిరోజూ అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని, రేపటికి కొంతవరకు ఆయన కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
Share this article :

0 comments: