ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి సమర్థుడైన నాయకుడు లేకపోవడంతో రాష్ట్రం రావణకాష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని విమర్శించారు. రాజకీయ పులి జూదంలో రాష్ట్రం ముక్కలు చెక్కలు చేసే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు మద్దతు పలికారని తమ్మినేని విమర్శించారు. ప్రపంచంలోని తెలుగువారిని ఏకంగా చేయాలన్న సిద్ధాంతంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, చంద్రబాబు దీనికి తూట్లు పొడిచారని అన్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీ మద్దతు ఇవ్వరాదన్నారు. దేశ సార్వభౌమ అధికారం, రాష్ట్రాల పరిక్షణ గురించి పట్టించుకోకుండా విభజన చేయడం వల్ల అనర్థాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
0 comments:
Post a Comment