వైఎస్ జగన్ లాంటి నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ లాంటి నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు

వైఎస్ జగన్ లాంటి నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు

Written By news on Thursday, August 29, 2013 | 8/29/2013

'రాజకీయ పులి జూదంలో రాష్ట్రం ముక్కలు చెక్కలు'
హైదరాబాద్ : వైఎస్ జగన్ లాంటి నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలు జగన్ నాయకత్వం కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ సభ్యత్వం తీసుకున్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి సమర్థుడైన నాయకుడు లేకపోవడంతో రాష్ట్రం రావణకాష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార  స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని విమర్శించారు. రాజకీయ పులి జూదంలో రాష్ట్రం ముక్కలు చెక్కలు చేసే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు మద్దతు పలికారని తమ్మినేని విమర్శించారు. ప్రపంచంలోని తెలుగువారిని ఏకంగా చేయాలన్న సిద్ధాంతంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, చంద్రబాబు దీనికి తూట్లు పొడిచారని అన్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీ మద్దతు ఇవ్వరాదన్నారు. దేశ సార్వభౌమ అధికారం, రాష్ట్రాల పరిక్షణ గురించి పట్టించుకోకుండా విభజన చేయడం వల్ల అనర్థాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Share this article :

0 comments: