వైఎస్ జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం:ఏబీకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం:ఏబీకే

వైఎస్ జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం:ఏబీకే

Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ శనివారం హైదరాబాద్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన మీరు త్యాగాలకు పూనుకోవద్దని ఆయన జగన్కు ఈ సందర్భంగా హితవు పలికారు.
 
వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు బాసటగా నిలవాల్సిన సమయంలో ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం మీ నాయకత్వం ప్రజలకు చాలా అవసరమని ఈ సందర్భంగా జగన్కు ఏబీకే ప్రసాద్ గుర్తు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని చీల్చేందుకు సిద్దమైందని ఏబీకే ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
Share this article :

0 comments: