ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు. చికిత్స కోసం వైద్యులు చేసిన ప్రయత్నాలను వైఎస్ జగన్ నిరాకరించారు.
వైద్యానికి జగన్ నిరాకరించడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తే, బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్థామని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ ఎం ఓ రఫీ తెలిపారు.
షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గియాని, కీటోన్స్ 4+, షుగర్ లెవల్ 49కి పడిపోయినట్టు, బీపీ 110/70 ఉన్నట్టు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.
ఇదిలాఉండగా ఉస్మానియా ఆస్పత్రి నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిమ్స్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో ఏర్పాటు జరుగుతున్నాయి. నిమ్స్, ఉస్మానియా వైద్య అధికారులుతో పోలీసులు మాట్లాడుతున్నారు. నిమ్స్ కు తరలించేందుకు బుల్లెట్ ఫ్రూవ్ వాహనాన్ని సిద్ధం చేసినట్టు కూడా వార్తలు అందుతున్నాయి.
0 comments:
Post a Comment