నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరిస్థితి ఆందోళనగా ఉందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి శనివారం నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో వెల్లడించారు. ప్లూయిడ్స్ తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నారని తెలిపారు. జగన్ దీక్ష కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కూడా జగన్ ను కలవనివ్వకుండా నిలువరిస్తున్న అధికారులు, పోలీసుల తీరు పట్ల వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ దీక్ష శనివారం ఆరో రోజుకు చేరుకుంది. దాంతో ఆయనను గరువారం అర్థరాత్రి ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో కూడా ఆయన చేపట్టిన దీక్షను విరమించేందుకు నిరాకరించారు. దాంతో వైఎస్ జగన్ ను శుక్రవారం అర్థరాత్రి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కానీ ఆయన అక్కడ కూడా వైద్యుల సూచనలు పాటించకుండా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. దాంతో ఆయన ఆరోగ్యంపై సర్వత్రా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, తలసిల రఘురాం, మిధున్ రెడ్డిలు శనివారం ఉదయం నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి జగన్ ఆరోగ్యంపై పైవిధంగా స్పందించారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ దీక్ష శనివారం ఆరో రోజుకు చేరుకుంది. దాంతో ఆయనను గరువారం అర్థరాత్రి ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో కూడా ఆయన చేపట్టిన దీక్షను విరమించేందుకు నిరాకరించారు. దాంతో వైఎస్ జగన్ ను శుక్రవారం అర్థరాత్రి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కానీ ఆయన అక్కడ కూడా వైద్యుల సూచనలు పాటించకుండా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. దాంతో ఆయన ఆరోగ్యంపై సర్వత్రా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, తలసిల రఘురాం, మిధున్ రెడ్డిలు శనివారం ఉదయం నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి జగన్ ఆరోగ్యంపై పైవిధంగా స్పందించారు.
0 comments:
Post a Comment