ఉప ఎన్నికలలో మహబూబ్ నగర్ శాసనసభా స్థానం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రాజేశ్వర రెడ్డి భార్య విజయలక్ష్మి ప్రకటించారు. 2009 ఎన్నికలలో రాజేశ్వర రెడ్డి ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గుండెపోటు కారణంగా ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఆయన భార్య విజయలక్ష్మికే ఉప ఎన్నికలలో టిక్కెట్ ఇస్తారని భావించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు విజయలక్ష్మి ప్రకటించారు.
Home »
» మహబూబ్ నగర్ లో స్వతంత్రఅభ్యర్థిగా విజయలక్ష్మి
మహబూబ్ నగర్ లో స్వతంత్రఅభ్యర్థిగా విజయలక్ష్మి
Written By ysrcongress on Tuesday, February 21, 2012 | 2/21/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment