జగన్ రాకతో జనసంద్రమైన రొంపిచర్ల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రాకతో జనసంద్రమైన రొంపిచర్ల

జగన్ రాకతో జనసంద్రమైన రొంపిచర్ల

Written By ysrcongress on Wednesday, February 22, 2012 | 2/22/2012

విరామం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్ర గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల నుంచి ఈరోజు ప్రారంభమైంది. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు రొంపిచర్లలో జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

రొంపిచర్ల బిసి కాలనీ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో జనసంద్రమయింది. జగన్‌ రాక వైఎస్‌ అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. మహానేత విగ్రహాన్ని తమ కాలనీలో జగన్‌ చేతులమీదుగా ఆవిష్కరింపజేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. తమ చిన్నారులకు జగన్‌ దీవెనలు తీసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ కుటుంబంపై చూపుతున్న ప్రేమాభిమానాలకు జగన్‌ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం చిలకలూరిపేటలో స్ధానికులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఓదార్పుయాత్రలో తమ గ్రామం మీదుగా వస్తున్నారని తెలుసుకున్న సమీప గ్రామస్తులు జగన్‌ కాన్వాయ్‌ను ఆపి బొకేలు, కండువాలు ఇవ్వడానికి పోటీ పడ్డారు. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చెబుతూ జగన్‌ ముందుకు కదిలారు.

ఈరోజు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జగన్‌ పర్యటన కొనసాగుతుంది. ఆరేపల్లి, బుచ్చన్నపాలెం గ్రామాల్లో జగన్‌ మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కొనకంటివారి పాలెం, గోగులపాడు గ్రామాల మీదుగా నేటి ఓదార్పు యాత్ర సాగుతుంది.
Share this article :

0 comments: