సహకార ఎన్నికల ఓటర్ల నమోదుకు గడువు ముగిసినా, అధికార పార్టీకి తొత్తుగా మారి, మద్యం సేవించి, లంచం తీసుకుని ఓట్లను నమోదు చేస్తున్న సహకార ఎన్నికల అధికారిని ైవె ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్హ్యాండెండ్గా పట్టుకుని అధికారులకు అప్పగించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పాకాల మండలం వడ్డేపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది. సహకార ఓటర్ల నమోదు ఈనెల నాలుగో తేదీనే ముగిసింది. అయితే పాకాల సీఈఓ మురళి ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకుల ఇంట్లో కూర్చుని 1200 ఓట్లను నమోదు చేస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడి రైతులు, గ్రామస్తులు సమాచారమందించారు. చంద్రగిరి నియోజకవర్గం నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు వీరిని రెడ్హ్యాండెండ్గా పట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పారిపోగా, సీఈవో మురళిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద రూ.50 వేల నగదు, ఓటరు నమోదు ఫారాలను స్వాధీనం చేసుకుని, పర్యవేక్షణ అధికారి చంద్రశేఖర్కు అప్పగించారు.
Home »
» గడువు ముగిసినా సహకార ఓటర్ల నమోదు!
గడువు ముగిసినా సహకార ఓటర్ల నమోదు!
Written By news on Monday, January 7, 2013 | 1/07/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment