శరద్ యాదవ్ తో విజయమ్మ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శరద్ యాదవ్ తో విజయమ్మ సమావేశం

శరద్ యాదవ్ తో విజయమ్మ సమావేశం

Written By news on Tuesday, August 27, 2013 | 8/27/2013

ఢిల్లీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం జెడియు అధినేత శరద్ యాదవ్ తో సమావేశమయ్యారు.  రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను కేంద్ర నాయకత్వానికి, ప్రధాన పక్షాల నేతలకు వివరించేందుకు ఈ బృందం ఇక్కడకు వచ్చింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఆనాలోచిత నిర్ణయం వల్ల సీమాంధ్రలో తీవ్రరూపం దాల్చిన ఉద్యమం గురించి వివరించడంతోపాటు రాష్ట్రాన్ని విభజించవలసి వస్తే ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ బృందం కోరుతోంది. జెడియు లాంటి పక్షాలను కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.

ఈ బృందం ఈ ఉదయం రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీని, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసి పరిస్థితిని విరించారు.
Share this article :

0 comments: