వైఎస్ఆర్ అన్న ఒక్క పదం జకీయాలకు ఒక కొత్త అర్థం చెప్పడమే కాకుండా, భావి తరాలకు భరోసా కల్పించారని షర్మిల తెలిపారు. ఆనాడు రైతులకు ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ అండగా ఉన్నారని, రైతుల రుణమాఫీ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కే దక్కుతుందున్నారు. వైఎస్సార్ వచ్చిన తర్వాత వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెరిగడమే కాకుండా, పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించారన్నారు. అంతేకాకుండా 71 లక్షల మంది ఆయన పథకాల నుంచి లబ్ది పొందారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఏ పన్నూ పెరగకపోవడమే కాకుండా, ఆర్టీసీ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని షర్మిల తెలిపారు.
వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రం అస్తవ్యస్తమైందన్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు. గత ఐదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడి పోషించారన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులకు బాబు-కిరణ్ లే కారణమన్నారు. తిరిగి రాజన్న రాజ్యాన్ని దక్కించుకోవాలంటే జగన్నను సీఎంను చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
0 comments:
Post a Comment