- ఉత్సాహంలో వైఎస్సార్సీపీ శ్రేణులు
కావలి, న్యూస్లైన్: కావలి పట్ట ణంలో గురువారం షర్మిల నిర్వ హించిన రోడ్షో సక్సెస్ అయిం ది. తొలుత స్థానిక ఏఎం బేకరీ సెంటర్ వద్ద పాస్టర్లు షర్మిలకు సంఘీభావం తెలిపారు. రాజ న్న బిడ్డను చూసేందుకు జనా లు పెద్దసంఖ్యలో వీధుల్లో గుమికూడారు. స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో నిర్వహించిన రోడ్షోలో షర్మిల ప్రసంగించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్, ట్రంకురోడ్డు పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసాయి. ప్రజలు ఎం డను సైతం లెక్క చేయకుండా షర్మిల ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు.
షర్మిల వైఎస్సార్ పేరు ఉచ్చరించినప్పుడల్లా ప్రజలు వెంటనే జోహార్ వైఎస్సార్ అంటూ ప్రజలు నినాదాలిచ్చారు. అక్కడి నుంచి రోడ్ షో పట్టణ ఉత్తర శివారు ప్రాంతం వరకు సాగింది. పట్టణంలోని వార్డుల్లో మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న వారిని షర్మిలకు ప్రతాప్కుమార్రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు పోనుగోటి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
0 comments:
Post a Comment