వైఎస్ జగన్ కు బహుమతిగా అసెంబ్లీ,లోక్ సభ స్థానాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ కు బహుమతిగా అసెంబ్లీ,లోక్ సభ స్థానాలు

వైఎస్ జగన్ కు బహుమతిగా అసెంబ్లీ,లోక్ సభ స్థానాలు

Written By news on Sunday, March 16, 2014 | 3/16/2014

వైఎస్ జగన్ కు బహుమతిగా అసెంబ్లీ,లోక్ సభ స్థానాలుగుడివాడ అమర్‌నాథ్
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సొంత ఇంటిలోకి వచ్చినంత ఆనందంగా ఉందని  మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాథరావు తనయుడు  అమర్‌నాథ్ అన్నారు. టిడిపి నుంచి ఇటీవల వైఎస్ఆర్ సిపిలో చేరిన అమర్, ఆయన తల్లి నాగమణి, అప్పల నరసయ్యలను పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ కార్యకర్తలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలతోపాటు 3 లోక్ సభ స్థానాలను గెలిచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి  బహుమతిగా ఇస్తామని చెప్పారు.

టిడిపికి నూకలు చెల్లాయన్నారు. టీడీపీలో ఇమడలేకే బయటికొచ్చినట్లు తెలిపారు.  తనను పార్లమెంట్ కు పంపిచే ఆలోచన జగన్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని అమర్ చెప్పారు.

 అనకాపల్లి మాజీ ఎంపీ గుడివాడ గురునాథరావు తనయుడు  అమర్‌నాథ్ కు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే  ఎనలేని అభిమానం. చోడవరం వద్ద కల్యాణీ డ్యామ్‌కు వైఎస్ ఆర్ గుడివాడ గుర్నాథరావు డ్యామ్‌గా నామకరణం చేశారు. దాంతో ఆయనకు అభిమానం ఎక్కువైంది. గుడివాడ గుర్నాధ రావు  మరణం తరువాత వారి కుటుంబం టీడీపీలో చేరింది.  2004లో అమర్ తల్లి  నాగమణి పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ పార్టీ ముఖ్యనాయకులే ఆమెను ఓడించారు. ఆ పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం, వైఎస్ఆర్ పై అభిమానంతో ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరారు.
Share this article :

0 comments: