ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు ప్రజల కోసం ఏనాడు ఒక్క పోరాటం కూడా చేయలేదన్నారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజించాలని చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్రం రెండు ముక్కలయిందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతులేని పోరాటం చేసిందని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు సైతం వదులుకున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలసి తెలుగు జాతిని విడదీశారని షర్మిల ఆరోపించారు
0 comments:
Post a Comment