ఎన్నికల కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల పార్టీ అభ్యర్థుల తరఫున వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సమరశంఖం పూరించారు. అలాగే విజయమ్మ అనంతపురం జిల్లా కదిరి నుంచి, షర్మిల శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ప్రచారం ప్రారంభించారు. వీరి తదుపరి ప్రచార షెడ్యూళ్లను వైఎస్ఆర్ సీపీ వర్గాలు గురువారం ప్రకటించాయి.
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. 21వ తేదీన మండపేట, 22వ తేదీన సామర్లకోట, పెద్దాపురం, 23వ తేదీన పిఠాపురం, గొల్లప్రోలు, 24వ తేదీన ఏలేశ్వరం, తుని ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి.
ఇక పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కర్నూలు జిల్లాలో తన పర్యటనను కొనసాగిస్తారు. 21వ తేదీన బనగానపల్లె, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల, 22వ తేదీన బండి ఆత్మకూరు, వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, నందికొట్కూరు, 23వ తేదీన డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో ఆమె బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి.
మరోవైపు పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తన ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తారు. 21వ తేదీన గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, 22వ తేదీన అద్దంకి, చిలకలూరిపేట, చీరాల, 23వ తేదీన బాపట్ల, పొన్నూరు, రేపల్లె, 24వ తేదీన తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, 25వ తేదీన మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో వైఎస్ షర్మిల బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. 21వ తేదీన మండపేట, 22వ తేదీన సామర్లకోట, పెద్దాపురం, 23వ తేదీన పిఠాపురం, గొల్లప్రోలు, 24వ తేదీన ఏలేశ్వరం, తుని ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి.
ఇక పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కర్నూలు జిల్లాలో తన పర్యటనను కొనసాగిస్తారు. 21వ తేదీన బనగానపల్లె, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల, 22వ తేదీన బండి ఆత్మకూరు, వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, నందికొట్కూరు, 23వ తేదీన డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో ఆమె బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి.
మరోవైపు పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తన ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తారు. 21వ తేదీన గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, 22వ తేదీన అద్దంకి, చిలకలూరిపేట, చీరాల, 23వ తేదీన బాపట్ల, పొన్నూరు, రేపల్లె, 24వ తేదీన తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, 25వ తేదీన మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో వైఎస్ షర్మిల బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి
0 comments:
Post a Comment