ఏనాడైనా నీతిగా పనిచేశావా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏనాడైనా నీతిగా పనిచేశావా ?

ఏనాడైనా నీతిగా పనిచేశావా ?

Written By news on Tuesday, March 18, 2014 | 3/18/2014

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘తొమ్మిదేళ్ల నీ పరిపాలనలో ఏ ఒక్క రోజైనా నీతిగా నిజాయితీగా పనిచేశావా? నీ పాలన మొత్తం అవినీతిమయం కాదా? ఏలేరు స్కామ్, మద్యం టెండర్ల వ్యవహారం.. ఐఎంజీ భూ కుంభకోణం.. ఇలా రోజుకో అక్రమానికి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? ఎఫ్‌డీఐల విషయంలో రాజ్యసభలో నీ పార్టీ సభ్యులను గైర్హాజరయ్యేలా చక్రం తిప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడటంలో మర్మమేమిటి? నీ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసి ఏడాది క్రితం కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడి ఉండకపోతే.. తెలుగు జాతి రెండు ముక్కలయ్యేదా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
 
 నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని చెప్పారు. ‘‘రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం వైఎస్.. వైఎస్ అన్న పేరు వింటేనే ప్రజలకు ఓ భరోసా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదే బాటలో నడుస్తున్నారు’’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మడకశిర, ధర్మవరం, అనంతపురంలో వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోలకు జనం పోటెత్తారు. మూడు చోట్లా బహిరంగసభల్లో ఆమె మాట్లాడారు. ప్రసంగ సారాంశం వైఎస్ విజయమ్మ మాటల్లోనే..
జగన్‌తోనే సువర్ణయుగం..
 జగన్ సీఎంగా బాధ్యతలు చేపడితే వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుంది. వైఎస్ అమలు చేసిన పథకాలతోపాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారు. అమ్మ ఒడి పథకం, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు పెన్షన్‌లు రూ.700కు పెంచుతారు. చేనేత కార్మికులకు మగ్గాలను ఉచితంగా ఇస్తారు. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తారు.. ముడి సరుకులను రాయితీపై ఇస్తారు.. వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసి నేత కార్మికుల్లో ధైర్యాన్ని నింపుతారు.. ఆప్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయించి.. చేతినిండా పని కల్పిస్తారు.
 - వైఎస్ విజయమ్మ
 
*  చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించారు. 23,500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్లపైకి ఈడ్చారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే.. జీతాలు, పెన్షన్‌లు, డీఏలు ఇవ్వడం వల్ల ఖజానాపై భారం పడుతుందని రాగాలు తీశారు. ఇప్పుడేమో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఊరూరా ఊదరగొడుతున్నారు.
*  రాష్ట్రంలో 3.50 కోట్ల ఇళ్లున్నాయి.. 23,500 మంది ఉద్యోగులను తొలగించిన చంద్రబాబు.. 3.50 కోట్ల ఉద్యోగాలు ఇవ్వగలరా.. ఒక్క క్షణం ఆలోచించండి.
*  చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో కరువు కాటకాలు రాజ్యమేలాయి. సాగునీళ్లు కాదు కదా కనీసం తాగునీళ్లు కూడా దొరకని దుస్థితి. కరువుతో 15 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఏ ఒక్క రైతుకైనా పరిహారం అందించిన పాపాన పోలేదు.. పైగా తిన్నదరక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న మహానుభావుడాయన. వ్యవసాయం దండగన్న ప్రబుద్ధుడాయన.
 
 కిరణ్ పదవిలో ఉండి ఏం చేశారు?
 వైఎస్ మరణించిన నాలుగు నెలలకే కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలసి తెలుగు జాతిని రెండు ముక్కలు చేసే కుట్రకు నాంది పలికారు. రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయి. వైఎస్ బతికి ఉంటే.. తెలుగు జాతి రెండు ముక్కలయ్యేదా? కిరణ్ ఓ వైపు రాష్ట్ర విభజనకు రూట్‌మ్యాప్‌లు తయారు చేస్తూనే.. మరో వైపు చివరి బాల్ తన వద్ద ఉందంటూ మభ్యపెట్టారు. ఇప్పుడేమో 25 మంది ఎంపీలను ఇస్తే.. రాష్ట్ర విభజనను ఆపుతానంటూ కొత్త రాగం అందుకున్నారు.’’
Share this article :

0 comments: