ఆనాటి చంద్రబాబు పాలనంతా కూడా చీకటి యుగంగానే ఆమె అభివర్ణించారు. ఆయన పాలనలో ప్రజలు వలసలు పోయిన సంగతిని విజయమ్మ గుర్తు చేశారు. రైతులను జైల్లో పెట్టించిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబేనన్నారు. ఆయన పాలనలో ఎక్కువమంది రైతులు చనిపోయారని ఆనాడు శరద్ పవార్ పార్లమెంట్ చెప్పారని విజయమ్మ తెలిపారు. ఏనాడైనా ఆయన ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకున్న పాపాన పోలేదని విమర్శించారు.ఈ రోజు పల్లెల్లో బెల్ట్ షాపులు ఉన్నాయంటే దానికి కారణం బాబు పాలన కాదా?అని ప్రశ్నించారు.2009 నగదు బదిలీ, కోటి వరాలు అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పాడని, ఇప్పుడు కూడా తప్పుడు హామీలతో ప్రజల వద్దకు వెళుతున్నాడని విజయమ్మ ఎద్దేవా చేశారు.
300శాతం ఇన్పుట్ సబ్సిడీని వైఎస్ఆర్ ఇచ్చారని, రోడ్డు ప్రమాదం జరిగినా, పొలంలో పురుగోపుట్రో కాటేసినా ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేదని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యం కోసం పుస్తెలు, పొలాలు అమ్ముకున్న సందర్భాలు చూశామని, అందరికీ ఆరోగ్యం అందాలనే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టారన్నారు. అందుకే ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని, ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ను చూస్తున్నాని వైఎస్ విజయమ్మ తెలిపారు.
ప్రజలు తాగునీరు లేక అల్లాడుతుంటే, చంద్రబాబు ఇంకుడు గుంతలు తవ్వుకోమన్నారని, ఏ వాగ్దానాల మీద టీడీపీ అధికారంలోకి వచ్చిందో వాటిని చంద్రబాబు తుంగలో తొక్కారని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఒక్క హామీని అమల్లోకి తెచ్చిన పాపానపోలేదని, చంద్రబాబు 9 ఏళ్లలో రుణమాఫీ గురించి ఎందుకు ఆలోచించలేక పోయారని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు.
0 comments:
Post a Comment