కాంగ్రెస్ కు చంద్రబాబు, చిరంజీవి అమ్ముడుబోయారు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ కు చంద్రబాబు, చిరంజీవి అమ్ముడుబోయారు: షర్మిల

కాంగ్రెస్ కు చంద్రబాబు, చిరంజీవి అమ్ముడుబోయారు: షర్మిల

Written By news on Tuesday, March 18, 2014 | 3/18/2014

కాంగ్రెస్ కు చంద్రబాబు, చిరంజీవి అమ్ముడుబోయారు: షర్మిలవీడియోకి క్లిక్ చేయండి
సూళ్లూరుపేట: టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుబోయారని వైఎస్ షర్మిల విమర్శించారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ కు అమ్ముకుంటే, చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలసి అమ్ముడుబోయారని ఆరోపించారు. మంగళవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

రైతులకు ఏ కష్టం వచ్చినా దివంగత మహానేత వైఎస్ఆర్ అండగా నిలిచారని షర్మిల గుర్తు చేశారు. ఉపాధి హామీ, ఆరోగ్య శ్రీ, 104, 108 వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేతదేనని చెప్పారు. పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించారని అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శించారు. చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు ఎవరి స్వార్థం కోసం వారు సహకరించారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని, జాతీయ నేతలందరినీ కలసి విభజనను అడ్డుకోవాలని అభ్యర్థించారని షర్మిల చెప్పారు. ప్రజల కష్టాలు తీరాలంటే రాజన్న రాజ్యం రావాలని, అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం జగనన్నజీవితాన్ని ధారపోస్తారని షర్మిల చెప్పారు.  
Share this article :

0 comments: