రైతులకు ఏ కష్టం వచ్చినా దివంగత మహానేత వైఎస్ఆర్ అండగా నిలిచారని షర్మిల గుర్తు చేశారు. ఉపాధి హామీ, ఆరోగ్య శ్రీ, 104, 108 వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేతదేనని చెప్పారు. పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించారని అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శించారు. చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు ఎవరి స్వార్థం కోసం వారు సహకరించారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని, జాతీయ నేతలందరినీ కలసి విభజనను అడ్డుకోవాలని అభ్యర్థించారని షర్మిల చెప్పారు. ప్రజల కష్టాలు తీరాలంటే రాజన్న రాజ్యం రావాలని, అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం జగనన్నజీవితాన్ని ధారపోస్తారని షర్మిల చెప్పారు.
Home »
» కాంగ్రెస్ కు చంద్రబాబు, చిరంజీవి అమ్ముడుబోయారు: షర్మిల
కాంగ్రెస్ కు చంద్రబాబు, చిరంజీవి అమ్ముడుబోయారు: షర్మిల
Written By news on Tuesday, March 18, 2014 | 3/18/2014
రైతులకు ఏ కష్టం వచ్చినా దివంగత మహానేత వైఎస్ఆర్ అండగా నిలిచారని షర్మిల గుర్తు చేశారు. ఉపాధి హామీ, ఆరోగ్య శ్రీ, 104, 108 వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేతదేనని చెప్పారు. పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించారని అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శించారు. చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు ఎవరి స్వార్థం కోసం వారు సహకరించారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని, జాతీయ నేతలందరినీ కలసి విభజనను అడ్డుకోవాలని అభ్యర్థించారని షర్మిల చెప్పారు. ప్రజల కష్టాలు తీరాలంటే రాజన్న రాజ్యం రావాలని, అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం జగనన్నజీవితాన్ని ధారపోస్తారని షర్మిల చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment