వైఎస్ జగన్ కు తిరుగులేని మెజారిటీ: సర్వే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ కు తిరుగులేని మెజారిటీ: సర్వే

వైఎస్ జగన్ కు తిరుగులేని మెజారిటీ: సర్వే

Written By news on Thursday, March 20, 2014 | 3/20/2014

వైఎస్ జగన్ కు తిరుగులేని మెజారిటీ: సర్వే
న్యూఢిల్లీ : ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు జరిగినా, ఎంతమంది ఎన్ని కూటములు కట్టినా కూడా.. వైఎస్ఆర్ సీపీకి ఎదురు లేదన్న విషయం మరోమారు స్పష్టమైపోయింది. సీమాంధ్రలో అత్యధిక స్థానాలను కచ్చితంగా వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఎన్డీటీవీ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాయలసీమ, కోస్తా ఆంధ్రప్రాంతాల్లో కలిపి మొత్తం 25 లోక్ సభ స్థానాలున్నాయి. వీటిలో 15 స్థానాలను కచ్చితంగా వైఎస్ఆర్ సీపీయే గెలుచుకుంటుందని ఎన్డీటీవీ సర్వే తేల్చి చెప్పింది. బీజేపీ - టీడీపీ కలిసి కూటమి కట్టినా.. ఆ రెండింటికీ కలిపి కూడా మహా అయితే 9 స్థానాలకు మించి వచ్చే అవకాశం లేనే లేదని సర్వేలోతెలిసింది. 
కేవలం ఓట్లు, సీట్లు సాధించడం కోసం విశాల రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా ముక్కలుచెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని సర్వే తెలియజేసింది. ఇంతకుముందు ఆ పార్టీకి ఈ ప్రాంతంలో 21 స్థానాలుండగా, అందులో 20 చోట్ల తుక్కుతుక్కుగా ఓడిపోయి.. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని ఎన్డీటీవీ సర్వే తెలియజేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానం, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే సమర్థంగా కొనసాగించగలరన్న విశ్వాసం ఆయనను అందలం ఎక్కిస్తాయని సర్వే చేసినవారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
Share this article :

0 comments: