రాత్రికి రాత్రి కుట్రపన్ని, పొద్దున్నే కనీసం తమ ఓటుహక్కు కూడా వినియోగించుకోకుండానే అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో 35 సీట్లకు పైగా కైవసం చేసుకుని, మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే పరిస్థితి ఉందని, అందుకే తమను అణిచేయడానికి టీడీపీ నాయకులు కుట్రపన్ని ఇలా చేశారని ఆరోపించారు. ఉదయాన్నే రాజమండ్రి మూడో వార్డుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు బుచ్చయ్య చౌదరి వచ్చారని, అనిల్ రెడ్డి ఇక్కడ ఉంటే ఓటింగ్ బాగా జరుగుతుందని పోలీసులకు చెప్పి, ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఎప్పుడో 28వ తేదీన ఒక గొడవ జరిగిందని, అందులో కూడా అనిల్ రెడ్డి లేరని, అయినా ఇప్పుడు ఆయనను తీసుకెళ్లడంలో అర్థమేంటని ప్రశ్నించారు.
అయితే, అనిల్ రెడ్డిని తాము అరెస్టు చేయలేదని,ఇరు వర్గాలకు చెందిన నాయకులు గొడవ పడతారన్న ఉద్దేశంతో తాము ముందు జాగ్రత్తగా తీసుకొచ్చినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. రెండు పార్టీల నాయకుల మధ్య గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతోనే తాము అదుపులోకి తీసుకున్నామన్నారు. కనీసం ఆయనతో మాట్లాడించాలని మీడియా కోరినా.. అందుకు అనుమతించకుండా, లోపలకు తీసుకెళ్లిపోయారు.
0 comments:
Post a Comment