పశ్చిమ గోదావరి జిల్లాలో సుడిగాలి పర్యటన జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన నేటినుంచి మూడురోజుల పాటు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గమైన రామచంద్రాపురంలో పర్యటించనున్నారు. మొదటిరోజు పర్యటనకు త్రినాధ్ రెడ్డి ఇంటి నుంచి గురువారం ఉదయం జగన్ బయల్దేరారు.
తొలిరోజు కె.గంగవరం మండలం యండగండి నుంచి భారీ ర్యాలీతో పర్యటన ప్రారంభమవుతుంది. పామర్రు ప్రధాన సెంటర్ సత్యవాడ మీదుగా జగన్ కె.గంగవరం చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత వెంకటాయపాలెం మీదుగా ద్రాక్షారామం వెళ్తారు. అక్కడ ప్రసంగం అనంతరం వెల్ల, రామచంద్రాపురం, రాజ్గోపాల్ సెంటర్, మార్కెట్ సెంటర్ల మీదుగా తొలిరోజు పర్యటన సాగనుంది. రాత్రికి కె.గంగవరంలో జగన్ బస చేస్తారు.
తొలిరోజు కె.గంగవరం మండలం యండగండి నుంచి భారీ ర్యాలీతో పర్యటన ప్రారంభమవుతుంది. పామర్రు ప్రధాన సెంటర్ సత్యవాడ మీదుగా జగన్ కె.గంగవరం చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత వెంకటాయపాలెం మీదుగా ద్రాక్షారామం వెళ్తారు. అక్కడ ప్రసంగం అనంతరం వెల్ల, రామచంద్రాపురం, రాజ్గోపాల్ సెంటర్, మార్కెట్ సెంటర్ల మీదుగా తొలిరోజు పర్యటన సాగనుంది. రాత్రికి కె.గంగవరంలో జగన్ బస చేస్తారు.
0 comments:
Post a Comment