రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అనే నినాదంతో గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ ఆశయాలను తీసుకెళ్లాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తలపెట్టిన 141 రోజుల మహా పాదయాత్రకు 100 రోజు స్థానిక బట్వాడిపాళెంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమం ఉద్ధేశం నెరవేరాలని అనారోగ్య కారణాలను కూడా లెక్క చేయకుండా కోటంరెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలోనే ఆ పార్టీ నేతలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఆయన వస్తున్నారని తెలిసి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు బట్వాడిపాళెం సెంటర్కు చేరుకుని ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అక్కడ నుంచి 100 రోజు పాదయాత్ర ప్రారంభమైంది. అంబటిరాంబాబు, గోవర్దన్రెడ్డి, శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్రెడ్డిలకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. భారీ గజమాల వేసి సత్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకన్నారు. పాస్టర్స్ అసోసియేషన్ తరుపున వైఎస్ జగన్ను ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశారు. జిల్లాలో ఆనం సోదరుల ఆగడాలు, వారి ఊసరవెల్లి రాజకీయాలతోపాటు వైఎస్ జగన్పై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న కుట్రల గురించి వైఎస్సార్సీపీ నేతలు వివరిస్తూ వైఎస్సార్సీపీ ఆశయాలను గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమానికి అంబటి రాంబాబు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కొనసాగించారు.
Home »
» మహా పాదయాత్రకు అపూర్వ ఆదరణ
మహా పాదయాత్రకు అపూర్వ ఆదరణ
Written By news on Saturday, April 7, 2012 | 4/07/2012
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అనే నినాదంతో గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ ఆశయాలను తీసుకెళ్లాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తలపెట్టిన 141 రోజుల మహా పాదయాత్రకు 100 రోజు స్థానిక బట్వాడిపాళెంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమం ఉద్ధేశం నెరవేరాలని అనారోగ్య కారణాలను కూడా లెక్క చేయకుండా కోటంరెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలోనే ఆ పార్టీ నేతలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఆయన వస్తున్నారని తెలిసి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు బట్వాడిపాళెం సెంటర్కు చేరుకుని ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అక్కడ నుంచి 100 రోజు పాదయాత్ర ప్రారంభమైంది. అంబటిరాంబాబు, గోవర్దన్రెడ్డి, శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్రెడ్డిలకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. భారీ గజమాల వేసి సత్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకన్నారు. పాస్టర్స్ అసోసియేషన్ తరుపున వైఎస్ జగన్ను ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశారు. జిల్లాలో ఆనం సోదరుల ఆగడాలు, వారి ఊసరవెల్లి రాజకీయాలతోపాటు వైఎస్ జగన్పై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న కుట్రల గురించి వైఎస్సార్సీపీ నేతలు వివరిస్తూ వైఎస్సార్సీపీ ఆశయాలను గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమానికి అంబటి రాంబాబు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కొనసాగించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment